News February 12, 2025

గద్వాల్: ఘనంగా భూలక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం 

image

గద్వాల్ జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి లింగం బావిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు విగ్రహాలను లింగం బావిలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు గద్వాల్ పట్టణ ప్రజలు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

Similar News

News March 2, 2026

పుష్పగిరిలో కనపడని యువకుల ఆచూకీ

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆదివారం సరదాగా ఈత కోసం దిగిన కొండాపురం మండలంలోని గండ్లూరుకు చెందిన శ్రీనాథ్ కడపకు చెందిన చైతన్య గల్లంతైన విషయం తెలిసిందే. వారికోసం పోలీసులు, బంధువులు గజ ఈతగాళ్ల సహాయంతో వెతుకులాట ఆరంభించారు. సోమవారం ఉదయం 9 వరకు వారి ఆచూకీ కనిపించలేదు. దాంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అనుముకున్నాయి. వీరు కడప నగరంలో ఎంబీఏ చదువుతున్నారు.

News March 2, 2026

తిరుపతిలోని SVIMSలో ఉద్యోగాలు

image

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (<>SVIMS<<>>) 26 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి MBBS, BDS, BSc(నర్సింగ్, రేడియోగ్రఫీ), ANM, CVT, MIT, PG డిప్లొమా, PG(సోషల్ వర్క్), టెన్త్, ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. సైట్: svimstpt.ap.nic.in

News March 2, 2026

ప్రకాశం: కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన ఒంగోలు యువకుడు హేమంత్ (17) మృతదేహం లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ టీం సాయంతో గాలింపు చేపట్టగా, సోమవారం ఈర్నపాడు దగ్గర శవం దొరికినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.