News December 18, 2025

గద్వాల్: చర్చీల అలంకరణకు ప్రభుత్వం సాయం- నుషిత

image

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 100 చర్చిలకు రంగులు, లైటింగ్స్ వేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని గద్వాల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నుషిత గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రిజిస్టర్ చేయబడిన చర్చిల నిర్వహకులు ఈనెల 20 వరకు జిల్లా మైనార్టీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7013032567 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News December 19, 2025

పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు

image

AP: ప్రస్తుత జీవనశైలి, పెరిగిన ఖర్చులతో దంపతులు ఒకరిద్దరు పిల్లలకే పరిమితమవుతున్నారు. అయితే చిత్తూరు(D) ఆవల్ కండ్రిగలో ఓ జంట 21 ఏళ్లలో 14 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఏడుగురు మగ, ఏడుగురు ఆడపిల్లలు కాగా ఓ బాలిక చనిపోయింది. 13 కాన్పులు ఇంట్లోనే జరగగా 14వ కాన్పు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జరగడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఇన్ని కాన్పులతో మహిళలకు తీవ్ర సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

News December 19, 2025

దేవరాపల్లి: బోగస్ అడ్మిషన్లపై ఇద్దరు హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు

image

​దేవరాపల్లి మండలంలో విద్యార్థుల బోగస్ ఎన్రోల్‌మెంట్‌పై విద్యాశాఖ సీరియస్ అయింది. బొడ్డపాడు ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం, కాశీపురం లోటస్ స్కూల్ హెచ్‌ఎంలకు DEO అప్పారావు నాయుడు నోటీసులు జారీ చేశారు. ​బొడ్డపాడు ప్రభుత్వ పాఠశాలలో పేర్లు నమోదైన ఇద్దరు విద్యార్థులు వాస్తవానికి లోటస్ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఈ వ్యవహారంపై మరింత విచారణ చేస్తామన్నారు.

News December 19, 2025

దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీ, డాక్యుమెంట్స్‌ను JAN 27వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech, B.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.deendayalport.gov.in/