News December 14, 2025

గద్వాల్ జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం జరిగిన నాలుగు మండలాల గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఆదివారం అధికారులు విడుదల చేస్తున్నారు. మల్దకల్ మండలం శేషంపల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ కాంతమ్మ 25 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె గ్రామస్థులకు, తనకు మద్దతు తెలిపిన అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 18, 2025

నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

image

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM.. సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.

News December 18, 2025

నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

image

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM.. సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.

News December 18, 2025

SVU: LLM ఫలితాలు విడుదల

image

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈఏడాది ఆగస్టులో పీజీ(PG) L.LM నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోగలరు.