News February 22, 2025
గద్వాల్ : తృటిలో తప్పిన పెను ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాయచూరు జిల్లాకు వెళ్లే మార్గంలో రోడ్డుకు పక్కన ఉన్న వెదురు బొంగుల గుడిసెలోకి శనివారం ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆ సమయంలో వెదురు బొంగుల గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అక్కడ నిలిపి ఉన్న స్కూటర్ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News November 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 10, 2025
మరిపెడ: తండా నుంచి హైకోర్టు న్యాయవాదిగా..

మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ నాయక్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మారుమూల తండా నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరారు. లా విద్యను సంగారెడ్డిలోని టిటిడబ్ల్యూఆర్ కళాశాల నుంచి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను పలువురు అభినందించారు.
News November 10, 2025
రాయచోటి కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం

ఇవాళ ఉదయం రాయచోటి కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు జిల్లా కలెక్టరేట్కు రాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చనన్నారు. అర్జీ స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. అర్జీలు స్థానికంగా పరిష్కారం కాని ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిందిగా తెలిపారు.


