News October 13, 2025

గద్వాల్: నిందితులను రిమాండ్ చేయాలి

image

గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక మరణంపై ఉన్న అనుమానాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, నిందితులను త్వరగా రిమాండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు జిల్లా ఎస్పీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. ​ప్రియాంక (అనుమానిత మరణం) కారణమైన వారిని వెంటనే రిమాండ్‌కు పంపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా చూడాలని వారు ఎస్పీని కోరారు.

Similar News

News October 13, 2025

జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

image

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.

News October 13, 2025

మందమర్రి: ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

image

మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓబీ ప్లాంట్ వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలను వీక్షించారు. కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమని, విజయాన్ని ఉద్యోగులు, కార్మికులు ప్రేరణ తీసుకోవాలన్నారు.

News October 13, 2025

మంచిర్యాల: నల్ల జెండాలతో నిరసన

image

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నల్లజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే భారతదేశం మీద దాడి జరిగినట్టే అన్నారు. దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.