News April 19, 2025
గద్వాల్: భూభారతితో రైతులకు భద్రత: పొంగులేటి

భూభారతి 2025 చట్టం రైతులకు మరింత భద్రత కల్పిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గద్వాల్ జిల్లా ధరూర్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై, మాట్లాడారు. గతంలో ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు. రైతు సమస్యలు తొలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News December 24, 2025
చలికాలంలో పెదవుల సంరక్షణకు

చలికాలం వచ్చిదంటే చాలు. చాలామంది పెదవులపై చర్మం పొరలుగా ఎండి ఊడిపోతుండటంతో పాటు పెదవులు నల్లబడిపోతుంటాయి. దీని వల్ల పెదాలు చూడటానికి మంచిగా కనిపించవు. ఈ సమస్యను దూరం చేయడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ☛ కొబ్బరి, బాదం నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. వీటిని పెదవులకు అప్లై చేస్తే మృదువుగా మారతాయి. ☛ పాలు, పసుపు కలిపి పెదవులపై కాసేపు మసాజ్ చేయాలి. దీంతో నలుపు తగ్గి పెదవులు మృదువుగా కనిపిస్తాయి.
News December 24, 2025
‘PPP’పై ఫైట్.. జగన్ సక్సెస్ అయ్యారా?

AP: PPPలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు <<18655341>>స్పందన<<>> కరవైంది. YCP చీఫ్ జగన్ కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిని జగన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల వద్ద నిరసనలు, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఇటీవల మరో అడుగు ముందుకేసి అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అది చట్టపరంగా సాధ్యం కాదు. కానీ, జగన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి.
News December 24, 2025
చిత్తూరు జిల్లాలో ఇతగాడితో జాగ్రత్త..!

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన కె.చంద్రబాబు(33)పై ప్రభుత్వం PD యాక్ట్ ప్రయోగించింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అమాయకులను మోసం చేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. రెండేళ్లలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రజాశాంతి భద్రతలకు ముప్పుగా మారినట్లు అడ్వయిజరీ బోర్డు తేల్చింది. 12నెలలు అతడిపై పీడీ యాక్ట్ అమలు కానుంది.


