News December 14, 2025
గద్వాల్: మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి గ్రామంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప స్వగ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి చెందాడు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉప్పరి వెంకటేష్ 60 ఓట్ల తేడాతో గెలుపు సాధించాడు. బీఆర్ఎస్ పార్టీలో ఖాతా తెరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమితో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News December 22, 2025
YS జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

అనంతపురం జిల్లాలో మాజీ సీఎం YS జగన్ బర్త్ డే సంబరాలు చర్చనీయాంశంగా మారాయి. విడపనకల్లులో వైసీపీ నేతలు వేట కొడవళ్లతో పొట్టేళ్లను నరికి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. కనగానపల్లి మండలం భానుకోటలో సైతనం ఇదే తరహా సంబరాలు చేసుకున్నారు. ఫ్యాక్షన్ గ్రామమైన భానుకోటలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2029లో రప్పా రప్పా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పొట్టేళ్లను బలితీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
News December 22, 2025
ఆసుపత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

TG: ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆసుపత్రి వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిషేధం విధించింది. క్యాంటీన్లలోనే ఆహారం తినేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. వార్డులో ఆహారం తిని పారవేయడంతో ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
News December 22, 2025
RR: నేడు సర్పంచ్ సాబ్, మేడమ్ వస్తున్నారు!

సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు వారి వారి గ్రామపంచాయతీల్లో ప్రమాణం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 526 GPలకు 525 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకున్నారు. నేడు వారితో పంచాయతీ సెక్రటరీలు ప్రమాణం చేయిస్తారు. కాగా జిల్లాలో మాడ్గుల మండలంలోని నర్సంపల్లి GPకి ఎన్నిక జరగలేదు. ప్రమాణ స్వీకారంపై జిల్లాలోని MPDOలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.


