News October 22, 2025
గద్వాల్: సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి

జిల్లాలోని రైస్ మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేసే విధంగా ఆయా రైస్ మిల్లర్ల నిర్వాహకులు కృషి చేయాలని సూచించారు.
Similar News
News October 23, 2025
ములుగు: ఇకనుంచి జరిమానా కాదు.. వాహనం సీజ్!

అక్రమ వసూళ్లకు ఆర్టీవో చెక్ పోస్ట్లు కేరాఫ్గా మారాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, ములుగు(D)లో మొదటినుంచి ఒక్క చెక్ పోస్ట్ లేదు. ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఏపీ వాహనాలు వచ్చిపోతుంటాయి. నిఘాను పెంచిన అధికారులు పర్మిట్ లేకుంటే ఇకనుంచి జరిమానా కాకుండా ఏకంగా వాహనాన్ని సీజ్ చేయనున్నారు.
News October 23, 2025
ఖమ్మం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో సీట్ల భర్తీ

జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో డ్రాపౌట్ల ద్వారా ఏర్పడిన 40 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. 3, 4, 6, 7, 8, 9వ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవంబరు 2వ తేదీలోపు కలెక్టరేట్లోని ఎస్-27 విభాగంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News October 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 23, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.02 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.