News November 19, 2025

గద్వాల్: హంద్రీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే హంద్రీ EXPRESS నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు మహబూబ్‌నగర్ రైల్వే ఎస్సై కే.రాజు తెలిపారు. దివిటిపల్లి బ్రిడ్జి రైల్వే లైన్ సమీపంలో డెడ్‌బాడీ లభించింది. మృతుడికి (25) ఉండవచ్చునని, రన్నింగ్ ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు గుర్తించారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే సెల్ నంబర్ 8712658597 సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News April 5, 2026

చిత్తూరు: రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు యాదమరిలో ఏఈ కార్యాలయంలో యాదమరి, బంగారుపాళ్యం మండలాలకు సంబంధించిన సమస్యలు తెలుపవచ్చన్నారు. అలాగే చిత్తూరు గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు చిత్తూరు, పూతలపట్టు మండల వినియోగదారులు సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 5, 2026

నేడు ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

image

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.

News April 5, 2026

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు

image

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ఆయన్ను విజయనగరం నుంచి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీడీవోగా, ఇతర శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని వెంకట్రామన్ పేర్కొన్నారు. జడ్పీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.