News April 1, 2025
గద్వాల: అయిజకు రాష్ట్రంలో నాలుగో స్థానం..!

పన్ను వసూళ్లలో అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సైదులు సోమవారం తెలిపారు. దీంతో అయిజ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అర్హత సాధించిందని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.82 కోట్లు లక్ష్యం నిర్దేశించుకుని, నేటికి రూ.1.62 కోట్లు వసూలు చేశామని తెలిపారు. ఇందుకు తమ కార్యాలయ సిబ్బంది విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు.
Similar News
News September 18, 2025
వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.
News September 18, 2025
VJA: దుర్గా మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయ వివరాలు

ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2,17,98,528 నగదు, 235 గ్రా. బంగారం, 1.39 కి.గ్రా. వెండి హుండీ కానుకలుగా వచ్చాయని EO శీనా నాయక్ తెలిపారు. 321 US డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 UAE దిర్హమ్స్, 25 సౌదీ రియల్స్, 200 ఒమన్ బైసా కరెన్సీతో పాటు 7 ఇతర దేశాల విదేశీ కరెన్సీ ఇంద్రకీలాద్రిపై ఉన్న 48 హుండీలలో కానుకలుగా వచ్చాయన్నారు.
News September 18, 2025
చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్

AP: ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.