News April 1, 2025
గద్వాల: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ సంతోష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించండి: కలెక్టర్

రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అర్హులైన యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పిస్తే, వాటిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్లైన్ చేస్తామని తెలియజేశారు. అధికారులు ప్రజలకు అవగహన కల్పించాలన్నారు.
News April 2, 2025
స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులు జోక్యం చేసుకోవాలి: రోహత్గి

TG: ఫిరాయింపు MLAల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశమని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని స్పీకర్కు చెప్పలేమా అని జస్టిస్ BR గవాయ్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్కు విజ్ఞప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ప్రశ్నించారు.
News April 2, 2025
MBNR: నేటి నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ 1961 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎటువంటి మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. నిషేధిత కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడకూడదన్నారు. డీజేలు లౌడ్ స్పీకర్లను కూడా పూర్తిస్థాయిలో నిషేధించామన్నారు.