News March 25, 2025

గద్వాల: ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం

image

పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి, నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. మంగళవారం గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను తెలుసుకున్నారు.

Similar News

News March 28, 2025

ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్‌, కోటంరెడ్డి

image

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌స్తూరిదేవి గార్డెన్స్‌లో శుక్రవారం‌ రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఆనం, వ‌క్ఫ్ బోర్డ్ ఛైర్మ‌న్ అజీజ్‌, నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.  వారు ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

News March 28, 2025

అనకాపల్లి: వచ్చే నెల 1న సాంఘిక శాస్త్రం పరీక్ష

image

పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీన రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని పరీక్షను 1వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.

News March 28, 2025

బాపట్ల: ‘పొగాకు రైతులకి న్యాయం చేయాలి’ 

image

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పొగా రైతులు, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు ప్రజా పరిష్కార వేదిక వద్ద బర్లీ పొగాకు రైతులకి న్యాయం చేయాలని, పంటను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.

error: Content is protected !!