News February 22, 2025

గద్వాల: కరెంట్ షాక్‌తో జూనియర్ అసిస్టెంట్ మృతి

image

కరెంట్ షాక్‌తో గట్టు మండలంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని గంగిమాన్‌దొడ్డికి చెందిన బోయ రాము(39) ధరూర్ తహశీల్దారు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన కొత్త ఇంటికి నీళ్లు పట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురై మ‌ృతిచెందారు. కుటుంబంలో యజమానిని కోల్పోవడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 

Similar News

News February 22, 2025

SRHపై ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్?

image

IPL టీమ్ SRHపై ఏపీ యువత మండిపడుతోంది. పేరుకే తెలుగు టీమ్ అని, ఒక్క మ్యాచ్ కూడా తమ రాష్ట్రంలో నిర్వహించడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. HYDలోనే మ్యాచులన్నీ నిర్వహిస్తే AP క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్షంగా ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ తెలుగోడు కాబట్టి విశాఖలో 2 మ్యాచులు ఆడిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై SRH ఓనర్ కావ్యా మారన్ ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు.

News February 22, 2025

లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

image

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమవారంలో లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావుకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ సందిగారి బసవయ్య, ధర్మకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

News February 22, 2025

BIG BREAKING: రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.

error: Content is protected !!