News March 18, 2025
గద్వాల కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్ల ధర్నా

పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదమ్మ ఏమేలమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.
Similar News
News November 3, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

AP: బాపట్లలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల MLA నరేంద్ర వర్మ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మి(60)గా గుర్తించారు.
News November 3, 2025
కామారెడ్డిలో WWC విజయ సంబరాలు

మహిళ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన సందర్భంగా ఆదివారం రాత్రి కామారెడ్డిలో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి జాతీయ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళ క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది.
News November 3, 2025
డ్రాగన్ ఫ్రూట్తో మహిళలకు ఎన్నో లాభాలు

కలర్ఫుల్గా కనిపించే డ్రాగన్ ఫ్రూట్లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆస్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్ ఫ్రూట్ను రెగ్యులర్గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.


