News March 18, 2025
గద్వాల కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్ల ధర్నా

పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదమ్మ ఏమేలమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.
Similar News
News February 24, 2026
NGKL: హాల్ టికెట్పై సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి: DIEO

ప్రైవేట్ కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా విద్యార్థులు ఆందోళన చెందవద్దని నాగర్కర్నూల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) వెంకటరమణ తెలిపారు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు మీసేవ ద్వారా హాల్ టికెట్లు పొంది నిశ్చింతగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.
News February 24, 2026
కేరళను ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం

కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పేరును కేరళంగా మారుస్తూ తీర్మానం చేసింది. కేంద్రం సైతం ఇదే పేరును గుర్తించాలని ప్రతిపాదించింది. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలోని ఫస్ట్ షెడ్యూల్లోనూ కేరళను కేరళంగా మార్చేలా సవరణలు చేపట్టాలని కోరింది. తాజాగా దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.
News February 24, 2026
పార్వతీపురం: ‘విద్యార్థుల సౌకర్యమే ప్రధానం’

వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రధానమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. మౌలిక వసతులతో పాటు గాలి, వెలుతురు ఉండేలా నిర్మాణాలు ఉండాలన్నారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న వివిధ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు.


