News April 24, 2025
గద్వాల: కాలువలో మహిళ మృతదేహం లభ్యం

జోగులాంబ గద్వాల పట్టణంలోని అగ్రహారం కాలువలో గుర్తుతెలియని వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైందని పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వయసు సుమారు 60 ఏళ్లు ఉంటుందన్నారు. నల్లటి జాకెట్, పింక్ చీర ధరించి ఉందని, ఆమె ఆచూకీ ఎవరికైనా తెలిస్తే గద్వాల పట్టణ పోలీస్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 15, 2025
కుప్పంలో CBG ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్

క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఊతమిస్తూ AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024’ కింద కుప్పం (M) కృష్ణదాసనపల్లిలో 10 TPD సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ను శ్రేష్ఠా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. నేపియర్ గడ్డి, సేంద్రీయ వ్యర్థాలతో CBGతో పాటు ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ (PROM) ఉత్పత్తి చేయనున్నారు.
News December 15, 2025
SPMVV: ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు SPMVV ఆధ్వర్యంలో నవంబర్ నెలలో నిర్వహించిన AP – RCET ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ ప్రవేశ పరీక్ష మొత్తం 65 సబ్జెక్టులకు నిర్వహించినట్లు చెప్పారు. 5,164 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. ఫలితాలు https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.
News December 15, 2025
రేపు ఉదయం దట్టమైన పొగమంచు.. జాగ్రత్త

తెలంగాణలో రేపు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, సెంట్రల్ తెలంగాణ జిల్లాల ప్రజలు రేపు ఉదయం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైవేలపై ప్రయాణం చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే కోల్డ్ వేవ్ కండిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Share it


