News September 20, 2025

గద్వాల: కూతురిని పండగకు పిలిచేందుకు వెళ్లి.. తండ్రి మృత్యువాత

image

కూతురుని పండగకి పిలిచేందుకు వెళ్లిన వ్యక్తి రైలు ఢీకొని మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజోలి వాసి మల్లయ్య(55) తన చిన్నకూతురుని పెద్దల అమావాస్య పండగకు తీసుకురావడానికి ఉందానగర్‌కి వెళ్లాడు. అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాలు జారి కిందపడ్డాడు. అదే సమయంలో వచ్చిన ఓ రైలు ఆయనను ఢీకొనటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 20, 2025

ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చ: జేసీ

image

జిల్లాలోని ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ నవ్య శనివారం తెలిపారు. సోమవారం నుంచి రూ.1,200 మద్దతు ధర అమలులో ఉండదని, రైతులు కళ్లాల్లో కానీ, లోకల్ ట్రేడర్స్ దగ్గర కానీ, ఇతర మార్కెట్లలో కానీ తమ ఉల్లి పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని అన్నారు.

News September 20, 2025

HYD: స్కిల్స్ నేర్చుకుంటేనే ఉపాధి: మాజీ మంత్రి

image

తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ ఎక్స్‌పో కార్యక్రమంలో BRS సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన మాజీ మంత్రి అనంతరం మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో యువత స్కిల్స్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలిపారు. తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

News September 20, 2025

HYD: స్కిల్స్ నేర్చుకుంటేనే ఉపాధి: మాజీ మంత్రి

image

తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ ఎక్స్‌పో కార్యక్రమంలో BRS సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన మాజీ మంత్రి అనంతరం మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో యువత స్కిల్స్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలిపారు. తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.