News March 18, 2025
గద్వాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఈ నెల 15న పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. ధరూర్ మండలం మన్నాపూర్కి చెందిన అబ్రహాం(21) కుటుంబకలహాలు భరించలేక పురుగుమందుతాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 14, 2025
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డయాబెటిస్ బాధితులు

ఖమ్మం జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉన్నారు. వీరిలో మధుమేహం లక్షణాలు ఉన్నవారు 55,829, అధిక రక్తపోటు ఉన్నవారు 77,604 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేల్లో జిల్లా మధుమేహ వ్యాప్తిలో 10వ జాబితాలో చేరింది. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’
News November 14, 2025
యాసంగి వరి సాగు.. ఆలస్యం వద్దు

TG: యాసంగిలో వరి నార్లు పోసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. నాట్లు ఆలస్యమైన కొద్దీ పంట దిగుబడులతో పాటు బియ్యం శాతం తగ్గి నూకశాతం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యాసంగి సాగుకు జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, R.S.R-29325, M.T.M-1010, తెల్లహంస, సన్నగింజ రకాలైన తెలంగాణ సోన, K.N.M-1638, K.N.M-733, W.G.L-962, జగిత్యాల సాంబ J.G.L-27356, R.N.R-21278 రకాలు అనుకూలం.
News November 14, 2025
తిలకధారణలో ఉన్న శాస్త్రీయత ఏంటి..?

స్త్రీలు కుంకుమ ధరించడం మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం. వివాహిత స్త్రీకి ఇది గొప్ప మంగళసూచకం. నుదుటి మధ్యభాగం ఆజ్ఞాచక్రం కలిగిన కేంద్రం. ఈ కేంద్రం జ్ఞానశక్తికి, ఆలోచనా శక్తికి ముఖ్య ఆధారం. ఇక్కడ కుంకుమను ధరించడం ద్వారా స్త్రీ ‘నేను శక్తి స్వరూపిణిని’ అని ప్రకటిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా మనసును ఏకాగ్రం చేసి, మనలోని శక్తిని పెంచడానికి, శాశ్వత సౌభాగ్యాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది. <<-se>>#Scienceinbelief<<>>


