News April 11, 2025
గద్వాల జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో ఉన్న జమ్ములమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News March 1, 2026
తిరుమల: మరో రెండు రోజుల్లో ఏకసభ్య కమిషన్

కల్తీ నెయ్యి ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ మరో రెండు రోజుల్లో తిరుమలకు రానున్నట్లు సమాచారం. కమిషన్ వచ్చాక చేయాల్సిన ఏర్పాట్లపై శనివారం టీటీడీ అధికారులు చర్చించుకున్నారు. వారు కార్యాలయంతో పాటు నెయ్యి టెండర్ల నిబంధనలు, వాటికి సంబంధించిన ఫైల్స్ తదితర వాటిని పరిశీలిస్తారు. కేసులో ప్రమేయం ఉన్న వారిని విచారించే అవకాశం కూడా ఉంది. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
News March 1, 2026
వేట్లపాలెం ఘటన.. రాజమండ్రి ఎయిర్పోర్ట్లోనే CM, పవన్ చర్చ (PHOTO)

వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై రాజమండ్రి ఎయిర్పోర్ట్లో శనివారం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. బాధితులను పరామర్శించి అమరావతి వెళ్తున్న సీఎంకు, కాకినాడ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రత, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.
News March 1, 2026
పాక్కు చుక్కలు చూపించిన లంక

T20 వరల్డ్ కప్లో పాకిస్థాన్కు శ్రీలంక చుక్కలు చూపించింది. ఆ జట్టును సెమీస్ చేరకుండా ఇంటికి పంపడమే కాకుండా దాదాపు గెలిచినంత పనిచేసింది. 213 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ జట్టు 207 రన్స్ చేసి కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 28 రన్స్ కొట్టాల్సి ఉండగా శనక(31 బంతుల్లో 76*) 3 సిక్సర్లు బాదడంతో పాక్ గజగజ వణికిపోయింది. అయితే చివరి రెండు బాల్స్ డాట్ కావడంతో పాక్ గట్టెక్కింది.


