News March 5, 2026
గద్వాల జిల్లాను టాప్లో నిలపండి: కలెక్టర్

విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, ఈ ఏడాది ఫలితాల్లో గద్వాల జిల్లాను రాష్ట్రంలో టాప్-15 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గద్వాల ఐడీవోసీ నుంచి నిర్వహించిన జూమ్ అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు. ఎండల దృష్ట్యా తగినంత నీరు తాగాలని, 6-8 గంటల నిద్ర తప్పనిసరన్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు.
Similar News
News March 5, 2026
భద్రాద్రి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు జడ్జి వసంత్ పాటిల్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్కు సూచించారు.
News March 5, 2026
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.


