News October 9, 2025

గద్వాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ వివరాలు ఇలా..!

image

గద్వాల జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉన్నాయి. 13 జడ్పీటీసీ స్థానాలు, 13 ఎంపీపీ స్థానాలు, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 696 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,93,627 పురుష ఓటర్లు, 1,99,78 మహిళా ఓటర్లు, 10 మంది ఇతరులు మొత్తం 3,93,418 మంది ఓటర్లు ఉన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరందరూ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News October 9, 2025

రాజగోపాల్ పేట: ముగిసిన టీజీఈపీసెట్ కౌన్సిలింగ్

image

ఈనెల 7న ప్రారంభమైన టీజీఈపీసెట్(బైపిసి)-2025 కౌన్సిలింగ్ నేటితో ముగిసిందని రాజగోపాల్ పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 700 మంది విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొన్నారని తెలిపారు. వారి ధ్రువపత్రాలు పరిశీలన చేసి వెబ్ ఆప్షన్లకు సంబంధించిన సూచనలు ఇచ్చామని అన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో అభినవ్, రాజు, రామకృష్ణ, షహబాజ్, విజయకుమార్ పాల్గొన్నారు.

News October 9, 2025

సిద్దిపేట: ఎన్నికల్లో చెల్లించాల్సిన డిపాజిట్ వివరాలు

image

ZPTC స్థానానికి పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు, SC, ST, BC అభ్యర్థులు రూ.2500 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. MPTC స్థానానికి జనరల్ వారు రూ.2500, SC, ST, BC అభ్యర్థులు రూ.1250, సర్పంచ్ స్థానానికి జనరల్ అభ్యర్థులు రూ.2 వేలు, SC, ST, BC అభ్యర్థులు రూ.1000, వార్డు మెంబర్ స్థానానికి జనరల్ అభ్యర్థులు రూ.500, SC, ST, BC అభ్యర్థులు రూ.250 చెల్లించాలన్నారు.

News October 9, 2025

అక్టోబర్ 10 నుంచి బోధనేతర పనుల బహిష్కరణ

image

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన బోధన సమయం హరించిపోతోందని AP ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆరోపించింది. దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో బోధనేతర పనులను అక్టోబర్ 10వ తేదీ నుంచి బహిష్కరించాలని తీర్మానించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం మెమోరాండాన్ని ఏజన్సీ DEO మల్లేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో UTF అధ్యక్షులు రాంబాబుదొర ఉన్నారు.