News April 14, 2025

గద్వాల జిల్లాలో బైక్ చోరీ

image

పార్క్ చేసిన బైక్ చోరీకి గురైన ఘటన నిన్న ఉండవెల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. కర్నూలులోని ఇందిరాగాంధీనగర్ వాసి భాస్కర్ పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఈనెల 8న బైక్ పార్క్ చేశారు. కొంత సమయం అనంతరం వచ్చి చూడగా బైక్ కనిపించకపోవటంతో స్థానికులను వాకబు చేశారు. ఎంతవెతికినా ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News January 4, 2026

ఇతిహాసాలు క్విజ్ – 117 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి దగ్గర పాంచజన్యం అనే శంఖంతో పాటు అతి శక్తిమంతమైన విల్లు ఉంది. దాని పేరేంటి? ఎవరు తయారుచేశారు?
సమాధానం: కృష్ణుడు కురుక్షేత్రంలో ఆయుధం పట్టనని చెప్పినప్పటికీ, ఆయన దగ్గర ‘శారంగం’ అనే శక్తిమంతమైన విల్లు ఉంది. ఇది విశ్వకర్మ తయారుచేసిన దివ్యాయుధం. అర్జునుడి గాండీవమే గాక శారంగం కూడా తిరుగులేని ఆయుధంగా పేరుగాంచింది. కృష్ణుడి నందకం అనే ఖడ్గం కూడా ఉంటుంది. <<-se>>#Ithihasaluquiz<<>>

News January 4, 2026

డబ్బు సేవ్ చేయకండి.. కియోసాకి సలహా

image

గతంలో ఉద్యోగం ఉంటే జీవితానికి భద్రత ఉండేదని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ‘ఇప్పుడు అన్ని పరిస్థితులు మారిపోయాయి. 2025లో పెద్ద టెక్ కంపెనీలే వేల కొద్దీ ఉద్యోగులను తొలగించాయి. అందుకే మీ ఫైనాన్షియల్ IQని పెంచుకోండి. ఎప్పుడూ డబ్బును సేవ్ చేయకండి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్‌ వంటి వాటిని సేవ్ చేసుకోండి’ అని ట్వీట్ చేశారు.

News January 4, 2026

కామారెడ్డి: సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసులకు రివార్డులు

image

కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలనిస్తోంది. తీవ్ర చలిలోనూ అప్రమత్తంగా వ్యవహరించి గంజాయి రవాణాను అడ్డుకున్న ఏఎస్ఐ నరసయ్య, సిబ్బంది సుబ్బారెడ్డి, రెడ్డి నాయక్, సంతోష్, బలరాం, భూపతిలను SP రాజేష్ చంద్ర అభినందించారు. వీరికి నగదు రివార్డులు అందజేశారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని SP విజ్ఞప్తి చేశారు.