News January 12, 2026
గద్వాల: జిల్లాల పునర్విభజన ప్రకటనతో సరిహద్దు ప్రజల్లో అయోమయం

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గుర్రంగడ్డ, ఎర్రవల్లి, ధరూర్ మండలాల గ్రామాలతో పాటు, కొత్తగా ఏర్పడిన ఉండవెల్లి, కేటిదొడ్డి మండలాల ప్రజలు తమ ప్రాంతాల భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. భౌగోళిక మార్పులు ఎలా ఉంటాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Similar News
News February 3, 2026
గద్వాల జిల్లాలో 285 క్యాన్సర్ కేసులు నమోదు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ దాస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 285 క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 131 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. డే కేర్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 3, 2026
ప.గో: తల.. మొండెం వేరు వేరుగా

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులో నమ్మి రాంబాబు(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రాంబాబు మృతదేహం మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహం పక్కనే చీర వేలాడుతుండగా.. మొండెం నుంచి తల వేరుపడి ఉంది. సుమారు ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
News February 3, 2026
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

ఒకే ఆటగాడు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడిన ఘటనలు గతంలో చూశాం. కానీ రెండు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటుచేసుకోనుంది. 2006లో సౌతాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్ ఆడిన వేన్ మ్యాడ్సన్ 20 ఏళ్ల తర్వాత ఇటలీ T20 WC కెప్టెన్గా బరిలో దిగనున్నారు. ఈయన గతంలో PSL, BPL, హండ్రెడ్ లీగ్లలోనూ పాల్గొన్నారు. ఇటలీ తరఫున 2023లో అరంగేట్రం చేశారు.


