News April 13, 2026
గద్వాల: జిల్లా పోలీస్ ప్రజావాణికి 10 ఫిర్యాదులు

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ టి. శ్రీనివాసరావు బాధితుల నుంచి 10 ఫిర్యాదులను స్వీకరించారు. భూ వివాదాలు, వేధింపులు వంటి సమస్యలపై విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Similar News
News April 13, 2026
ధోనీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!

CSK మాజీ కెప్టెన్ ధోనీ మరో 3-4 రోజుల్లో పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయని క్రీడా వర్గాలు తెలిపాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18న HYDలో SRHతో జరిగే మ్యాచులో ఆడతారని పేర్కొన్నాయి. కండరాల నొప్పి కారణంగా ధోనీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రేపు KKRతో మ్యాచులో ఆయన ఆడతారని టీమ్ మేనేజ్మెంట్ తొలుత భావించింది. కానీ పూర్తి ఫిట్గా మారేందుకు ఆయనకు మరికొంత టైమ్ అవసరమని సమాచారం.
News April 13, 2026
ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో మార్పులు

AP:ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో బోర్డు ఈఏడాది కొన్ని మార్పులు చేసింది. రిజల్ట్స్లో విద్యార్థుల 5గ్రూపు సబ్జెక్టుల మార్కులను మాత్రమే ప్రకటిస్తారు. ఆరోదైన అదనపు సబ్జెక్టు మార్కులు వాటితో కలపరు. కాలేజీకి పంపే మార్కుల మెమొరాండంలో వాటిని వేరుగా చూపిస్తారు. ఆ సబ్జెక్టులో ఫెయిలైనా గ్రూపు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే చాలు పాస్గా పరిగణిస్తారు. MPCలో బయాలజీ, BiPCలో మాథ్స్ అదనపు సబ్జెక్టులుగా ఉన్నాయి.
News April 13, 2026
భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ హిట్ ఇస్తాడా?

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్గా లాంచ్ అయిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ ఇవ్వలేదు. ఆ మూవీతో పాటు తర్వాత వచ్చిన ‘కింగ్డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కాంత’ కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం ఆమె అక్కినేని అఖిల్తో ‘లెనిన్’లో నటిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం అఖిల్కు ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ ఈ ఏడాది జూన్ 26న థియేటర్లలోకి రానుంది.


