News March 29, 2025

గద్వాల జిల్లా ప్రజలారా జర జాగ్రత్త…!

image

జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. శుక్రవారం గరిష్ఠంగా ధరూర్‌లో 40.8, భీమవరం, తోతినోనిదొడ్డిలో 40.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 24, 2025

బోరబండలో BRS‌ను పాతిపెట్టినం: CM రేవంత్ రెడ్డి

image

కోస్గి సభలో BRS, KCR మీద CM రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘BRSను అసెంబ్లీలో ఓడగొట్టినం. లోక్‌సభలో గుండు సున్నా ఇచ్చినం. కంటోన్మెంట్‌లో బండకేసి కొట్టినం. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరబండ బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్‌లను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు BRSను ఓడించినా సిగ్గులేకుండా పైచేయి మాదే అంటున్నారు. పొంకనాలు వద్దు KCR చేతనైతే అసెంబ్లీకి రండి’ అంటూ CM సవాల్ చేశారు.

News December 24, 2025

జంగుబాయి మహాపూజకు మంత్రి సీతక్కకు ఆహ్వానం

image

కెరమెరి మండలం కోట పరందోలిలో జరిగే జంగుబాయి దేవస్థానంలో ఈ నెల 30న ప్రభుత్వం అధికారికంగా మహాపూజ, దర్బార్ నిర్వహించనుంది. వేడుకలను హాజరుకావాలని మేడారంలో మంత్రి సీతక్కను డీసీసీ అధ్యక్షురాలు సుగుణ కలిసి ఆహ్వానించారు. అనంతరం మంత్రి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ సలాం శ్యామ్ రావు, ఉత్సవ కమిటీ పెద్దలు ఉన్నారు.

News December 24, 2025

ఆమదాలవలస : క్రిస్మస్ సోదరులకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

image

క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా సైకత శిల్పి గేదెల హరికృష్ణ బుధవారం చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. ఆమదాలవలస మండలం సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇసుకతో జీసస్ ప్రతిరూపాన్ని తయారుచేసి క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలియజేశారు. ఈ శిల్పాన్ని పలువురు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.