News May 22, 2024

గద్వాల: తల్లి, కుమార్తె సూసైడ్

image

కుటుంబ కలహాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఈ ఘటన గద్వాల జిల్లా మనవపాడు మండలం ఏ-బుడిదపాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నరసింహులు భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ (16) భూతగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో సాయంత్రం ఇంట్లో పురుగు మందు తాగినట్లు సమాచారం. వరలక్ష్మి, అనురాధ చికిత్స అందేలోపే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 15, 2025

MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

image

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.

News September 14, 2025

GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

image

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.