News July 22, 2024
గద్వాల: దంపతుల మధ్య గొడవ.. భర్త సూసైడ్

దంపతుల మధ్య గొడవతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. గద్వాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు సుధీర్, శ్వేత దంపతులు HYD అత్తాపూర్లో ఉంటున్నారు. శనివారం శ్వేత సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ దంపతుల మధ్య గొడవ జరగ్గా విసుగెత్తిన సుధీర్ సెల్ఫోన్ నేలకేసికొట్టి తన ఇంటికి వచ్చేశారు. కోపంతో వెళ్లారని అక్కడే ఉన్న శ్వేత.. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి సుధీర్ ఉరేసుకొని కనిపించారు. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News September 12, 2025
MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో మహబూబ్నగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అడ్డాకుల 23.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. చిన్నచింతకుంట 23.3, బాలానగర్ 15.3, మిడ్జిల్ 13.3, హన్వాడ 11.0, మహమ్మదాబాద్ 10.8, కౌకుంట్ల 7.3, సల్కర్ పేట 7.3, భూత్పూర్ 6.3, నవాబుపేట 6.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డు అయింది.
News September 11, 2025
జడ్చర్ల: ఎరువు విక్రయ కేంద్రాల తనిఖీ

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News September 11, 2025
MBNR: భారీ వర్షాలు.. SP కీలక ఆదేశాలు

వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు వచ్చే మూడు రోజులు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా ఉన్నందున గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు.