News March 24, 2025

గద్వాల: ‘నీళ్లు ఇచ్చే దాకా కదలం’ 

image

అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్‌డీఎస్ రైతులు సాగు నీళ్ల కోసం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సుమారు పన్నెండు గ్రామాల రైతులు మాట్లాడుతూ.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగు నీరు అందించాలని కోరారు. నీళ్లు ఇచ్చేదాకా కదలమని భీష్మించుకుని కూర్చున్నారు. 

Similar News

News December 23, 2025

ఇంటి ముఖ ద్వారం ఏ దిశలో ఉండాలి?

image

ఇంటికి ఏ దిశలోనైనా ముఖద్వారం ఉండవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే గాలి, వెలుతురు ప్రసరణ సరిగ్గా ఉండటం ముఖ్యమని అంటున్నారు. ‘ప్రధాన ద్వారాలు తూర్పు, పడమర దిశలలో ఉంటే, వాటికి లంబంగా ఉండే ఉత్తర, దక్షిణ గోడలకు కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి. ఫలితంగా గాలి ప్రవహించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంట్లోని అశుద్ధ గాలి బయటకు వెళ్లి, తాజా గాలి లోపలికి వస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 23, 2025

ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్

image

స్విగ్గీలో ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ ఐటమ్‌గా బిర్యానీ నిలిచింది. వరుసగా 10th ఇయర్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. భోజన ప్రియులు ఈ ఏడాది 93 మిలియన్ బిర్యానీలు స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ తన ఇయర్ ఎండ్ రిపోర్టులో పేర్కొంది. కాగా మోస్ట్ ఆర్డర్డ్ లిస్టులో బర్గర్స్ (44.2M), పిజ్జా (40.1M), వెజ్ దోశ (26.2M) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.

News December 23, 2025

సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

image

పర్యాటకుల సౌకర్యార్థం ఈనెల 29, 30 తేదీల్లో సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు RTC DM ప్రకాష్‌రావు తెలిపారు. మురుడేశ్వర్, గోకర్ణ, గోవా సందర్శనకు 2 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.2,800 చార్జీగా నిర్ణయించామని, ఈనెల 29న మ.12 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.