News March 11, 2025

గద్వాల: ప్రజావాణికి 38 ఫిర్యాదు: కలెక్టర్

image

గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 38 ఫిర్యాదులు వచ్చాయని గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News July 9, 2025

భారత నేవీలో 1,040 పోస్టులు

image

భారత నేవీలోని పలు విభాగాల్లో 1,040 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PH, మహిళలు మినహా మిగతావారికి రూ.295గా ఉంది. రాతపరీక్షతో పాటు పలు పోస్టులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పూర్తి వివరాల PDF కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 9, 2025

నిర్మల్: ‘15 తేదీలోగా దరఖాస్తు చేసుకోండి’

image

జిల్లాలో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని డీఈవో రామారావు తెలిపారు. మార్చి 2026లో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని నింపి దివ్యాంగుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేసి ఈనెల 15వ తేదీలోగా ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు.

News July 9, 2025

ఏలూరు: 14న 2,500 ఉద్యోగాలకు జాబ్ మేళా

image

వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హతలు ఉండాలన్నారు. వివరాలకు 8143549464 సంప్రదించాలి.