News March 11, 2025
గద్వాల: ప్రజావాణికి 38 ఫిర్యాదు: కలెక్టర్

గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 38 ఫిర్యాదులు వచ్చాయని గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 13, 2025
ప్రతీసారి కొట్టేది మేము.. కొట్టించుకునేది మీరు: కాంగ్రెస్ SM

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్దే విజయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో BRSను ఆ పార్టీ శ్రేణులు SMలో ట్రోల్ చేస్తున్నాయి. ‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్లో కొట్టాం. జూబ్లీహిల్స్లో కొడుతున్నాం. ప్రతీసారి కొట్టేది మేము, కొట్టించుకునేది మీరు. ఔర్ కుచ్ బాకీ హై క్యా’ అని పోస్టులు పెడుతున్నాయి. MBNRలో MLC ఎన్నికల్లో ఓడింది మర్చిపోయారా? అని BRS వర్గాలు రివర్స్ కౌంటర్ వేస్తున్నాయి.
News November 13, 2025
సంగాడ్డి: క్రమక్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. గురువారం ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 13.1 డిగ్రీలు, గుమ్మడిదలలో 17.0 డిగ్రీలు, అమీన్పూర్లో 18.2° డిగ్రీలు, రామచంద్రాపురంలో 12.5 డిగ్రీలు, పటాన్చెరులో 12.8° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 90.6%గా నమోదైంది. ఉదయం పూట చల్లని గాలులు వీచడంతో గ్రామస్థులు చలిమంటలను కాచుకుంటున్నారు.
News November 13, 2025
ADB: పోలీసుల WARNING

అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారితోపాటు ఆడపిల్లలను వేధించే వారిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక షీటీమ్లతో ఎక్కడికక్కడ నిఘా ఉందని, అమ్మాయిల జోలికి ఎవరైనా వెళితే తాట తీస్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని చెప్పారు. SHARE IT


