News September 22, 2025
గద్వాల: ప్రజావాణిలో 41 ఫిర్యాదులు.. పరిష్కరించండి: కలెక్టర్

గద్వాల జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యమిచ్చి, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 41 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆయన సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 23, 2025
సరిపడా సత్రాలు లేక మేడారం జాతరలో ఇబ్బందే..!

కోటి మంది భక్తుల కొంగుబంగారం మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను CM రేవంత్ రెడ్డి నేరుగా మంగళవారం పరిశీలించనున్నారు. కాగా, సారలమ్మ వచ్చే ఒకరోజు ముందుగానే భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి చేరుకుంటారు. అయితే, అక్కడ సరైన సత్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిపడా సత్రాలు ఏర్పాటు చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
News September 23, 2025
శ్రీశైలంలో అలరిస్తున్న కళారూపాలు

శ్రీశైల మహా క్షేత్రంలో కన్నుల పండువగా దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్లు బృంగి వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలు భక్తులను ఎంతగానో అలరించాయి. దేవతామూర్తుల రూపాలు, విచిత్ర వేషధారణ, వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
News September 23, 2025
MBNR జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేస్తామని, తనిఖీలకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.