News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 5, 2025

నిలువెల్లా రక్తం.. తల్లడిల్లిన తల్లి హృదయం..!

image

రోడ్డు ప్రమాదంలో ఆ తల్లికి తీవ్రగాయాలై నిలువెల్లా రక్తం కారుతోంది. అయినా సరే ఆ తల్లి హృదయం తన బిడ్డ కోసం తల్లడిల్లింది. తన బిడ్డకు ఏమైందోనని ఆమె పడిన ఆందోళన స్థానికులను కంటతడి పెట్టించింది. KMM జిల్లా <<15656275>>తనికెళ్ల వద్ద బస్సు బోల్తా<<>> పడిన ఘటనలో ఈ దృశ్యం కనిపించింది. బస్సులో ఉన్న తల్లాడ మండలం అన్నారుగూడెం వాసి బీరవెల్లి రాణికి రక్తం కారుతున్నా బిడ్డ కోసం వెతికింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

News March 5, 2025

వనపర్తి: పరీక్ష రాసిన 6,476 మంది ఇంటర్ విద్యార్థులు

image

తొలిరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షకు 6,714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,476 మంది హాజరయ్యారు. 238 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన అధికారులు వనపర్తిలోని వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

News March 5, 2025

ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

image

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

error: Content is protected !!