News February 1, 2025
గద్వాల: బైక్పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం: మంత్రి

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంధ్ర-పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్) తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కుటుంబాల అర్హతలు పక్కాగా పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయలని ఆదేశించారు.
News July 5, 2025
అనకాపల్లి: అభివృద్ధి సూచికపై ఎంపీడీవోలకు శిక్షణ

పంచాయితీ అభివృద్ధి సూచికపై విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఎంపీడీవోలకు విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి సూచికలో పొందుపరిచిన 22 అంశాలు, 9 థీమ్ లపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. పంచాయతీరాజ్ జాతీయ అవార్డులు సాధించే దిశగా కృషి చేయాలన్నారు. డీపీఆర్సీ ప్రిన్సిపల్ నాగలక్ష్మి, డిపిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News July 5, 2025
డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను పరిష్కరించండి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జేసీ సూరజ్, సంబంధిత రెవెన్యూ అధికారులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. ఆయా భూములను సరైన ఆధారాలు చూపినచో, అలాంటి వాటిని వెంటనే తీసుకొని, ఆయా భూములను వారి వారి రైతులకు, అర్హత కలిగిన వారికి 22ఏ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.