News April 7, 2025
గద్వాల: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188 మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421 మంది ఉన్నారు. మటన్, ఆయిల్ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.
Similar News
News October 19, 2025
అనపర్తి: వివాహ వార్షికోత్సవం రోజే మహిళ ఆత్మహత్య..?

అనపర్తికి చెందిన శిరీష (30) వివాహ వార్షికోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. భర్త సంతోశ్ ఆఫీసుకు వెళ్తూ జండూబామ్ కనపడకపోవడంతో భార్యను మందలించాడని, మనస్తాపం చెందిన శిరీష బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుందని వారు పేర్కొన్నారు. అయితే భర్త, అత్త, ఆడపడుచు వేధింపుల వల్లే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి అమ్మాజీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News October 19, 2025
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

దీపావళి పండుగను పల్నాడు జిల్లా ప్రజలు ఆనందోత్సవాల మధ్య అంగ రంగ వైభవంగా జరుపుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపు నిచ్చారు. చిన్న పిల్లల, పెద్దలు బాణాసంచా కాల్చే విషయంలో, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ కాలుష్య రహిత, ప్రజాహిత, ప్రజలకు ఇబ్బందిలేని పండగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు
News October 19, 2025
ఉప ముఖ్యమంత్రి, మంత్రికి PDPL MP లేఖలు

SC, ST విద్యార్థుల విద్యాపరమైన సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని DY.CM భట్టి విక్రమార్కకు, మంత్రి లక్ష్మణ్ కుమార్కు ఎంపీ వంశీకృష్ణ లేఖలు రాశారు. ప్రైవేట్ పాఠశాలలకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. విద్యార్థులకు విద్యలో అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. బీఎస్ఎస్ఎస్ పథకం పాఠశాలలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. భవిష్యత్ నిధుల విడుదలకు పారదర్శకమైన, సమయబద్ధమైన విధానం రూపొందించాలని MP విజ్ఞప్తి చేశారు.