News April 12, 2025

గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

image

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News April 12, 2025

MBNR: ఆ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో చిన్నచింతకుంటలో 39.7 డిగ్రీలు, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.6 డిగ్రీలు, నవాబుపేటలో 39.5 డిగ్రీలు, కోయిలకొండ (M) సిరివెంకటాపూర్‌లో 39.4 డిగ్రీలు, మిడ్జిల్ 39.3 డిగ్రీలు, కోయిలకొండ (M) పారుపల్లిలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

News April 12, 2025

MBNR: రాత్రి వేళల్లో వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

image

రాత్రి వేళల్లో కూడ వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. జిల్లాలోని PHC, అర్బన్ హెల్త్ సెంటర్లలో బయోమెట్రిక్ ఏర్పాటుచేసి హాజర్ ను పర్యవేక్షించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పేద రోగులకు సమర్థవంతమైన వైద్యసేవలు అందించాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 12, 2025

ఉమ్మడి జిల్లాలో రేపు మద్యం దుకాణాలు బంద్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్‌లు అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!