News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్జెండర్తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News December 23, 2025
TPT : ఇలాంటి వ్యక్తి జనావాసంలో ఉంటే ముప్పే…!

తిరుచానూరు PS పరిధిలో గంజాయి విక్రయిస్తూ యువతను నాశనం చేస్తున్న భాగ్యరాజ్ (43)పై PIT NDPS చట్టం సెక్షన్ 3(1) కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతనిపై ఇప్పటికే 3 ఎన్డీపీఎస్ కేసులు నమోదు కాగా, వివిధ ఘటనల్లో 10 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సామాజిక భద్రతకోసం ఈ కార్యకలాపాలను నియంత్రించేందుకు బాబు భాగ్యరాజ్ను కడప/నెల్లూరు కేంద్ర కారాగారంలో నిర్బంధించాలని ప్రభుత్వం ఆదేశించింది.
News December 23, 2025
మిరపలో వేరు పురుగు వల్ల నష్టం

మిరప పంటను ఆశించే వేరు పురుగు మొక్కల వేర్లను కొరికి తినడం వల్ల మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. ఇవి నేలలో “C” ఆకారంలో తెల్లగా ఉంటాయి. మిరప పంట కాలపరిమితి దాటిన తర్వాత ఈ పురుగులు వేప, రేగు, మునగ వంటి పంటలను ఆశించి వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఈ వేరు పురుగు ఆశించిన మొక్కలు పీకితే సులభంగా ఊడి వస్తాయి. వీటి ఉద్ధృతి తీవ్రమైతే పెద్ద మొత్తంలో మొక్కలు చనిపోయి, దిగుబడి తగ్గిపోతుంది.
News December 23, 2025
AIIMS భోపాల్ 128 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<


