News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్జెండర్తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News December 21, 2025
ములుగు: ప్రైవేట్ డీలర్ల “యూరియా “దోపిడి

జిల్లాలో ప్రైవేటు డీలర్ల యూరియా దోపిడీ గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంది. ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ బుకింగ్ ద్వారా మాత్రమే యూరియా సరఫరా చేస్తామని ప్రకటించడంతో ఫెర్టిలైజర్ యజమానులు తమ వద్ద ఉన్న నిల్వలను అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారు. ఒక బస్తాకు రూ.350 నుంచి రూ.400 వరకు ఇతర క్రిమిసంహారక మందులను లింకుతో రైతులకు అంటగడుతున్నారు. ఈసారి కూడా యూరియా కొరత తప్పదనే అపోహలతో ఈ పరిస్థితి నెలకొంది.
News December 21, 2025
KNR: డబుల్ ఇళ్ల పంపిణీలో ‘చేతివాటం’

KNR నియోజకవర్గంలో 660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పంపకానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. KNRలో 60 డివిజన్లకు కేవలం 300 ఇళ్లు కేటాయించి, మిగిలిన 360 ఇళ్లను అధికార పార్టీ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు స్పందించి అర్హులకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
News December 21, 2025
రేపు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం

TG: సీఎం రేవంత్ రేపు HYDలోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.


