News April 12, 2025
గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్జెండర్తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 30, 2025
అసలు ఎవరీ శివాంగీ సింగ్..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా యుద్ధ విమాన పైలట్ శివాంగీ సింగ్తో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో అసలెవరీమె అంటూ చర్చ మొదలైంది. శివాంగీ వారణాసిలో పుట్టి పెరిగారు. చదువుకొనేటప్పుడే NCCలో చేరారు. 2016లో ఎయిర్ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికై మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపారు. అలా 2020లో రఫేల్ మొదటి మహిళా పైలెట్గా చరిత్ర సృష్టించారు.
News October 30, 2025
6వ తరగతి నుంచి ఆయుర్వేద పాఠాలు

దేశవ్యాప్తంగా ఇకపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఆయుర్వేదాన్ని బోధించనున్నారు. NEPలో భాగంగా సైన్సు సబ్జెక్టులో ఈ అంశాల్ని చేర్చాలని అధికారులు నిర్ణయించారు. 6-8వ తరగతి వరకు ఈ పాఠాలుంటాయి. ఆరోగ్యం, పోషకాహారం, పర్యావరణంపై భారతీయ దృక్కోణంతో అవగాహన కలిగించడమే లక్ష్యమని NCERT డైరక్టర్ దినేశ్ ప్రసాద్ తెలిపారు. స్కూల్ స్థాయి నుంచి ఆరంభమైన దీన్ని రానున్న కాలంలో డిగ్రీ కోర్సులకూ విస్తరించే అవకాశముంది.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరద

ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం 4 లక్షలకు చేరువలో ఉన్న ప్రవాహం, సాయంత్రం 4 గంటల తర్వాత 5,00,213 క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీ నీటిమట్టం 13.8 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


