News December 27, 2025
గద్వాల: సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వీరే..!

గద్వాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో శుక్రవారం కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో గద్వాల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కొండపల్లి సర్పంచ్ కృష్ణారెడ్డి, ధరూర్ మండలం అధ్యక్షుడిగా విజయ్, కేటీ దొడ్డి మండల అధ్యక్షురాలుగా సోంపురం సరోజమ్మ, గట్టు మండల అధ్యక్షుడిగా శ్రీరామ్ గౌడ్, మల్దకల్ మండల అధ్యక్షుడిగా తూమ్ కృష్ణారెడ్డిని ఆయా గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Similar News
News December 27, 2025
సాగుభూమి సంరక్షణ వ్యవసాయంలో కీలకం

సాగు భూములకు రసాయనాల వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, సంప్రదాయ, దేశవాళీ పంట రకాల పెంపకం, నేలకోత నివారణ చర్యలు, నేలను కప్పి ఉంచడం వంటి చర్యలతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంటల అవశేషాలు, జీవన ఎరువులు, పశువుల వ్యర్థాలు, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
News December 27, 2025
WGL: అభివృద్ధి ఒక వైపేనా..!

గ్రేటర్ వరంగల్ నగరం పేరుకే గ్రేటర్లా ఉంది. అభివృద్ధి అంతా ఒక వైపే జరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు.వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలో మాత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల లోపే పనులకు శంకుస్థాపనలు జరిగినట్టు ప్రజలు చెబుతున్నారు. వరంగల్ పశ్చిమలో నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండగా.. మిగిలిన 2 ప్రాంతాల్లో కనిపించకపోవడం గమనార్హం.
News December 27, 2025
తిర్యాణి: తల్లిదండ్రులు మందలించారని యువతి SUICIDE

ASF జిల్లా తిర్యాణి మండలం నాయకపూగూడకు చెందిన పల్లె స్పందన(19) శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమె, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైంది. ఇంటికి రావాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఫినాయిల్ తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


