News September 10, 2025
గద్వాల: సైబర్ ఉచ్చు.. చదువుకున్నవారే బలైపోతున్నారు!

పని చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఆన్లైన్లో వెతుకుతున్నవారు సైబర్ మోసగాళ్లకు సులభ లక్ష్యాలు అవుతున్నారు. తాజాగా గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వాసి ట్రేడింగ్లో లాభాల పేరుతో రూ.22 లక్షలు, వడ్డేపల్లి వాసి రూ.8 లక్షలు కోల్పోయారు. చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారని పోలీసులే చెబుతున్నారు. విశ్వసనీయత లేకుండా అనుమానాస్పద యాప్స్ ద్వారా పెట్టుబడులు పెట్టడం.. తమకు తెలియకుండానే మోసాలకు బలవుతున్నారు.
Similar News
News September 10, 2025
వనపర్తి: ‘లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి’

జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత అన్నారు. ఈ నెల 13న వనపర్తి జిల్లా కోర్టులలో జరగనున్న లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. చిన్న కేసుల కోసం కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు.
News September 10, 2025
జగిత్యాల: గణపతి చందా ఇవ్వలేదని 4 కుటుంబాల బహిష్కరణ

జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడితే రూ.25 వేల జరిమానా అంటూ ఊర్లో దండోరా వేయించారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే రూ.1,116 ఇచ్చాకే కొట్టాలన్నారు. అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తోంది.
News September 10, 2025
మంచి నిద్ర కోసం చదవాల్సిన శ్లోకం

అగస్త్యో మాధవశ్చైవ
ముచకుందో మహామునిః
కపిలో మునిరాస్తీకః
పంచయతే సుఖశాయనః
ఈ ప్రసిద్ధమైన శ్లోకాన్ని పఠించి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని పండితులు చెబుతున్నారు. మంచి నిద్ర కోసం రుషులను తలచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వారి పేర్లు(అగస్త్య, మాధవ, ముచుకుంద, కపిల, ఆస్తీక) కలిపి ఈ శ్లోకాన్ని రాశారు.