News April 11, 2025
గద్వాల: హనుమాన్ శోభాయాత్రకు ఎంపీకి ఆహ్వానం

జోగులాంబ గద్వాలలో ఈనెల 12న జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట రాములు, బీజేపీ నాయకులు మీర్జా పురం వెంకటేశ్వర రెడ్డి, సంజీవ్ అయ్యా, కృష్ణం రాజు, రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.
News September 17, 2025
చైతన్యానికి చెలిమై.. ఉద్యమానికి ఊపిరైంది మన పాలమూరు!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ మరిగిన వేళ.. పాలమూరు ముఖ్య భూమిక పోషించింది. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక, గడియారం రామకృష్ణశర్మ రేడియో ప్రసారాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి.. ఉద్యమ జ్వాలలు పుట్టించారు. బూర్గుల రామకృష్ణరావు, అనంతలక్ష్మి మందుముల నర్సింగరావు లాంటి నేతలు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. నిజాం పాలనను తుడిచిపెట్టిన ప్రజాస్వామ్య జెండాకు ఈ జిల్లా గొప్ప మద్దతుగా నిలిచింది.
News September 17, 2025
HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.