News March 20, 2025

గద్వాల: 144 సెక్షన్ అమలు 

image

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163, BNSS అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాల్లో 717 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 20, 2025

ఎస్సీలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు

image

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News March 20, 2025

HYDలో మిస్ వరల్డ్ పోటీలు: జూపల్లి

image

TG: హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 140 దేశాల అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. అలాగే రాష్ట్రానికి ఆర్థికంగానూ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. స్క్విడ్ గేమ్, BTS బ్యాండ్ లాంటివి సౌత్ కొరియా అభివృద్ధికి ఉపయోగపడ్డాయని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.

News March 20, 2025

మోదీని కలిసిన ఎంపీ కుటుంబ సభ్యులు

image

ప్రధాని మోదీని ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యులు కలిశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనుమరాళ్లతో ప్రధానమంత్రి కాసేపు గడిపారు. మెదక్ ఎంపీ దంపతులు, అల్లుడు కూతురు, మనమరాళ్లతో కలిసి ప్రధానమంత్రి కలిసి శాలువా కప్పి సన్మానించారు.

error: Content is protected !!