News August 7, 2024

గనులు, మైనింగ్ ద్వారా VZM జిల్లా ఆదాయం ఎంతంటే

image

జిల్లాలో గనులు, మైనింగ్ ద్వారా 2023-24 ఏడాదికి రూ. 125 కోట్ల ఆదాయం జిల్లా నుంచి ప్రభుత్వానికి సమకూరింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆ లక్ష్యాన్ని మరింత పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.135 కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఇటీవల జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబుకు వివరించారు.

Similar News

News September 30, 2025

సీఎం పర్యటన.. 600 మంది బందోబస్తు: VZM SP

image

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News September 30, 2025

ఎస్.కోట: చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

image

తన చదువుకి తగ్గ సరైన ఉద్యోగం దొరకలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ నరసింహమూర్తి వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన గోకాడ ప్రదీప్ హైదరాబాదులో ఓ నెట్వర్క్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. సొంత గ్రామం కొత్తూరుకు 28న వచ్చాడు. 29న ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తండ్రి బాపు నాయుడు ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

News September 30, 2025

విజయనగరం కలెక్టరేట్ వద్ద వైసీపీ నిరసన

image

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నేతలు పాల్గొన్నారు.