News June 15, 2024
గన్నవరం ఎయిర్పోర్ట్ భద్రత CISFకి అప్పగించిన AAI
గన్నవరం ఎయిర్పోర్ట్ భద్రత బాధ్యతలను ఇకపై CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) పర్యవేక్షించనుంది. ఈ మేరకు విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత రెడ్డి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఆదేశాల మేరకు విమానాశ్రయ భద్రత బాధ్యతలు జూలై 2 నుంచి CISF ఆధీనంలో ఉంటాయని లక్ష్మీకాంత రెడ్డి స్పష్టం చేశారు.
Similar News
News October 2, 2024
ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాలు రద్దు చేశాం: EO
విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని ఆలయ EO కెఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశామన్నారు. ఉత్సవాలకు 15 లక్షల మంది వరకూ వస్తారని అంచనా వేశామన్నారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు చండీయాగం నిర్వహిస్తామన్నారు.
News October 2, 2024
విజయవాడ దసరా ఉత్సవాలకు గవర్నర్కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి, శ్రీశైల భ్రమరాంబికా దేవి నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం గవర్నర్ కార్యాలయమైన రాజ్భవన్కు మంత్రి ఆనం, వేదపండితులతో చేరుకుని అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదం ఇచ్చి గవర్నర్కు శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికలను అందజేశారు.
News October 2, 2024
షెడ్యూల్లో మార్పు.. బందరు పోర్టుకు బయల్దేరిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పులు జరిగాయి. కొద్దిసేపటి కిందటే ఆయన బందరు పోర్టుకు బయల్దేరారు. మచిలీపట్నం పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు.. తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. కాగా, షెడ్యూల్లో మార్పులు చేసుకొని పోర్టుకు బయల్దేరారు. కాగా, మచిలీపట్నం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోర్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.