News January 4, 2026
గన్నవరం చేరకున్న అశోక గజపతి రాజు

గోవా గవర్నర్ అశోక గజపతి రాజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయ లాంజ్లో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం లభించింది. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, ఇతర జిల్లా అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు. విమానాశ్రయం వెలుపల పోలీసు భద్రత మధ్య ఆయన కొద్దిసేపు అధికారులతో ముచ్చటించారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
Similar News
News January 7, 2026
సూర్యాపేట: పోలీసులపై కారం చల్లి రాళ్లతో దాడి

తుంగతుర్తి (M) రావులపల్లిలో పోలీసులపై సోమవారం రాత్రి కారం చల్లి రాళ్లతో దాడి చేసిన ఘటనలో 23 మందిపై కేసు నమోదు చేసినట్లు SI క్రాంతి కుమార్ తెలిపారు. భూ తగాదాలతో రైతు లాజరస్ చనిపోగా ఆందోళనకు దిగిన గ్రామస్థులు బందోబస్తులో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్తతలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.
News January 7, 2026
ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

AP: ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే.
News January 7, 2026
వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచే ఆలోచనలు

వ్యవసాయంలోనే కాదు ఏ రంగంలోనైనా వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆదాయం, అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఆ ఆలోచనలు మరీ గొప్పవే కానవసరం లేదు. తమకు వచ్చిన చిన్న చిన్న ఐడియాలనే సాగులో అమలు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు మనదేశంతో పాటు కొన్ని దేశాల్లోని రైతులు. అసలు ఆ ఆలోచనలు ఏమిటి? మనం అనుసరించడానికి అవకాశం ఉందా? ఆదాయం పెంచే ఆ ఐడియాల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


