News February 17, 2025

గన్నవరం: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News March 12, 2025

మచిలీపట్నం: సిమెంట్ ఫ్యాక్టరీకి ప్లాస్టిక్ వ్యర్థాలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్థుల నుంచి ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు ఒకచోట పోగుచేసి వాటిని పంచాయతీ వాహనాల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించాలన్నారు. 

News March 12, 2025

కృష్ణా: ఆ రెండు మండలాలకు హైఅలర్ట్

image

కృష్ణాజిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జిల్లాలోని రెండు మండలాలకు హైఅలర్ట్ ప్రకటించింది. ఉంగుటూరు 42.3 డిగ్రీలు, ఉయ్యూరు 42.6 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండనున్నట్లు తెలిపింది. మిగిలిన చోట్ల 32 డిగ్రీలకు పైగా ఉండనున్నట్లు తెలిపింది.

News March 12, 2025

P4 సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి: కలెక్టర్

image

ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛఆంధ్ర @ 2047 గోడపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ముందడుగు వేస్తోందన్నారు. 

error: Content is protected !!