News March 13, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం మరోసారి విచారణ జరగనుంది. గతంలో వంశీకి బెయిల్ నిరాకరించగా, తాజా పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఈ 71గా వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.

Similar News

News March 13, 2025

పిఠాపురం రేపటి పవన్ ప్రసంగంపై సర్వత్రా అసక్తి..!

image

రేపు పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన అవిర్భావ సభపై రాజకీయంగా భారీ అసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధించడం డిప్యూటీ సీఎంగా మొదటిసారి జరుగుతున్న సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పవన్ చరిష్మా పెరిగింది. దీనితో రేపు ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

News March 13, 2025

పాత సామాను బయటికెళ్లాలి: రాజాసింగ్

image

TG: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని వ్యాఖ్యానించారు.

News March 13, 2025

GNT: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

image

గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు.

error: Content is protected !!