News June 23, 2024

గరుగుబిల్లి: తోటపల్లి సమీపంలో ఏనుగుల గుంపు

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి పంప్ హౌస్ సమీపంలో ఏడు ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంతం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని కోరారు. వ్యవసాయ క్షేత్రాలలో పశువులను ఉంచరాదన్నారు.

Similar News

News October 5, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పెట్రోల్ ధర

image

విజయనగరం జిల్లాలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.108.96గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు కొంతమేర తగ్గింది. గత పది రోజులలో లీటర్ పెట్రోల్ రూ.108.69 – 109.52 మధ్యలో కొనసాగింది. డీజిల్ లీటర్ రూ.96.80గా ఉంది. గత పది రోజులలో దీని రేటు రూ.96.55 నుంచి 97.32 మధ్యలో ఉంటోంది. ఇటు పార్వతీపురం జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.38 కాగా డీజిల్ రూ.98.11గా ఉంది.

News October 5, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

News October 5, 2024

VZM: నేషనల్ టీంకు ఎంపికైన వ్యవసాయ కూలీ కొడుకు

image

అక్టోబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న నేషనల్ ఫుట్ బాల్ గేమ్స్‌కు కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన చింతాడ రాజేశ్ ఎంపికయ్యాడు. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాజేవ్ ఏపీ టీం తరఫున జాతీయస్థాయి ఆడనున్నాడు. గతంలో 3 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తండ్రి అప్పారావు, తల్లి లక్ష్మీ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.