News April 5, 2025

గరుగుబిల్లి: ‘రైతులు నూతను పద్ధతులు పాటించాలి’

image

జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద గల డా.వై.యస్.ఆర్ ఉద్యానవన కళాశాలలో ఖరీఫ్ పంటల సాగులో ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..నూతన పద్ధతులను అవలంభించి లాభసాటి పంటలు సాగు చేసి రైతులు అధిక ఆదాయం ఆర్జించాలని కోరారు.

Similar News

News November 12, 2025

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.73,18,504

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామి వారికి 76 రోజుల్లో రూ.73,18,504 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.వెంకటేష్ తెలిపారు. 80 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి, 21 విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News November 12, 2025

32,438 పోస్టులు.. రేపటి నుంచి అడ్మిట్ కార్డులు

image

రేపటి నుంచి గ్రూప్-D <<17650787>>పరీక్షలకు<<>> సంబంధించి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నట్లు RRB(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) తెలిపింది. 32,438 పోస్టులకు ఈ నెల 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చంది. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందుగానే పరీక్ష తేదీ, సిటీ వివరాలను RRB వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

News November 12, 2025

సంగారెడ్డి: కాంట్రాక్ట్ పద్ధతిన 12 పోస్టులు భర్తీ

image

జిల్లా వైద్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 12 పోస్టులు భర్తీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల మంగళవారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి 12 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు.