News January 3, 2026
గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
Similar News
News February 10, 2026
VZM: ‘సాంకేతికతను ఉపయోగిస్తూ అప్రమత్తంగా ఉండాలి’

ప్రతి ఒక్కరూ ఆధునిక పరికరాలను ఇంటర్నెట్ అనుసంధానంతో విరివిగా ఉపయోగిస్తున్నారని, దీంతో సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అన్నారు. విజయనగరం కలెక్టరేట్లో NIC ఆధ్వర్యంలో సురక్షిత అంతర్జాల దినోత్సవం మంగళవారం జరిగింది. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్లు, డెస్క్ టాప్, ల్యాప్టాప్లకు 2 అంచల భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
News February 10, 2026
గుర్లలో బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

గుర్ల మండలం పాలవలసలో ప్రత్యేక బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులచేత డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ మింగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొట్నూరి ప్రమీల, DMHO డాక్టర్ ఎస్.జీవనరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 10, 2026
గుర్లలో బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

గుర్ల మండలం పాలవలసలో ప్రత్యేక బోద వ్యాధి నివారణా కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులచేత డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ మింగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొట్నూరి ప్రమీల, DMHO డాక్టర్ ఎస్.జీవనరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


