News April 16, 2025

గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా యువకుడి MURDER

image

బతుకుదెరువు కోసం గల్ఫ్‌కి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం దుబాయ్‌లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట చెందిన స్వర్గం శ్రీనివాస్ చంద్రయ్య పాకిస్తానీ చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ ఇలా హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 17, 2025

ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

image

అవసరమైతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్‌ను ICC తిరస్కరించింది.

News September 17, 2025

IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<>IFSCA<<>>) 20 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫేజ్1 పరీక్ష అక్టోబర్ 11న, ఫేజ్ 2 పరీక్ష నవంబర్ 15న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ifsca.gov.in/Career

News September 17, 2025

అనకాపల్లి: ‘8ఏళ్ల తర్వాత దొరికిన నిందితుడు’

image

కొత్తకోట, రావికమతం పోలీస్ స్టేషన్లలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన 4కేసుల్లో నిందితుడు 8ఏళ్ల తర్వాత చిక్కాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. కాకినాడకు చెందిన కొరపాకల కుమారస్వామి (33)పై 2017లో కేసు నమోదు కాగా ఆనాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లోని భవాని‌నగర్‌ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న అతనిని తమ సిబ్బంది అరెస్టు చేయగా రిమాండ్‌కు తరలించామన్నారు.