News May 27, 2024

గల్ఫ్ దేశంలో జగిత్యాల వాసి కష్టాలు.. సెల్ఫీ వీడియో

image

గల్ఫ్ దేశానికి వెళ్లిన తనను ఓ ముఠా మోసం చేసిందంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. జగిత్యాలకు చెందిన రాజేశ్(39) 6నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఓ ముఠా జాబ్ ఇప్పిస్తానని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. ఇండియాకు వెళ్లిరావాలని వారు చెప్పడంతో స్వదేశానికి బయల్దేరగా అబుదాబి ఎయిర్పోర్టులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రమేయం లేకుండా లోన్లు తీశారని, ప్రభుత్వం కాపాడాలని బాధితుడు కోరారు.

Similar News

News December 24, 2025

కరీంనగర్: పత్తి రైతులకు విజ్ఞప్తి

image

జిల్లా పత్తి రైతులకు సీసీఐ వారు కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసి పత్తిని అమ్ముకొనే క్వింటాళ్ల నిబంధనలో మార్పు చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి తెలిపారు. ఈ నెల 25 అర్థరాత్రి నుంచి స్లాట్ బుకింగ్ చేసుకొన్న రైతులు గరిష్టంగా అదనంగా 5 క్వింటాళ్ళ పత్తిని విక్రయించడానికి అనుమతి ఇవ్వడమైనది. రైతులు పత్తి పరిమాణాన్ని నమోదు చేసుకొని పత్తి కొనుగోళ్ళకు సహకరించాలని కోరారు.

News December 24, 2025

సీపీఐ శతవసంతాల ముగింపు సభను విజయవంతం చేయండి: చాడ

image

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ఉత్సవాలలో బాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. గడిచిన వందేళ్లలో పేదల పక్షాన నిలబడి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

News December 24, 2025

KNR: దక్షిణాది స్థాయి ఈత పోటీలకు స్వరణ్‌, భువన్‌ ఎంపిక

image

హైదరాబాద్‌లో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగే దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కంకణాల స్వరణ్‌, భువన్‌ ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వరణ్‌ బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో రజత పతకం సాధించగా.. వాటర్‌ పోలో జట్టుకు భువన్‌ ఎంపికయ్యారు. వీరిని జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో శ్రీనివాస్‌గౌడ్, కోచ్‌లు అభినందించారు.