News April 8, 2025
గాంధారి: అడవిలోకి తీసుకెళ్లి దాడి.. మహిళ మృతి

గాంధారి మండలం చందాపూర్ తండాకు రాజి అనే వ్యక్తి అమీనా బేగం అనే మహిళను అడవిలోకి తీసుకెళ్లి చితక బాదాడు. అరుపులు విన్న కొంతమంది ఆమెను గాంధారి ఆసుపత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ మరణించిందని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. పోలీసుల వివరాలు.. హైదరాబాద్లో వారికి పరిచయం ఏర్పడిందని రాజి తన నాలుగేళ్ల బాబును ఆమె వద్ద ఉంచి వెళ్లగా ఆ మహిళా బాబును అమ్మేసిందని అనుమానంతో ఆమెపై దాడి చేశాడు.
Similar News
News April 8, 2025
ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్సెట్ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.
News April 8, 2025
IPL: ఈరోజు రెండు మ్యాచ్లు

IPLలో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్లో KKR, LSG తలపడనుండగా రాత్రి 7.30 గంటలకు ముల్లాన్పూర్లో PBKS, CSK బరిలోకి దిగనున్నాయి. LSG, KKR రెండూ విజయాల బాటలోనే ఉండటంతో ఆ మ్యాచ్ హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండో మ్యాచ్లో చెన్నై ఈరోజైనా గెలుస్తుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్లో నెలకొంది. ఈ మ్యాచుల్లో ఎవరు గెలవచ్చు? కామెంట్స్లో చెప్పండి.
News April 8, 2025
టారిఫ్లను ఆపే ఆలోచన లేదు: ట్రంప్

ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారన్న వదంతులు వచ్చాయి. వాటిని ట్రంప్ కొట్టిపారేశారు. ‘మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు. కానీ చర్చలకు రావాలనుకునే ఏ దేశంతోనైనా సరే మాట్లాడేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని ఆయనతో భేటీ అయ్యారు. ఇటు భారత్ కూడా ఆ విషయంలో అమెరికాతో చర్చల్లో ఉంది.