News April 8, 2025

గాంధారి: అడవిలోకి తీసుకెళ్లి దాడి.. మహిళ మృతి

image

అడవిలోకి తీసుకెళ్లి మహిళపై దాడి చేసి చంపేసిన ఘటన సోమవారం గాంధారిలో చోటుచేసుకుంది. SI ఆంజనేయులు తెలిపిన వివరాలు.. చందాపూర్ తండాకు చెందిన పీరాజి HYDలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడే బిక్షాటనే చేస్తున్న అమీనాబేగం తన 4ఏళ్ల కొడుకును అమ్మేసిందనే అనుమానంతో ఆమెను HYD నుంచి తండా అడవి ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం భయంతో ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది.

Similar News

News April 17, 2025

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్: NZB CP

image

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నిజామాబాద్ CP సాయి చైతన్య వెల్లడించారు. ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారని పేర్కొన్నారు. ఇకపై మైనర్ల డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్షతో పాటు వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

News April 16, 2025

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రిలోని రేకుల షెడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News April 16, 2025

NZB: ‘అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు’

image

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజికమాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్ధేశంతో కొందరు సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

error: Content is protected !!